పిచ్చి వాడంటారే ఒకరు,వెర్రి వాడంటు వేరొకరు
కానీ ఆ వాన మనసుకెరుకే ఈ పుడమి తల్లి వేదనలు
నువ్వు దూరం కాదు నాకు,నేను దూరం కాదు నీకు
అన్నది ఎరుక నా ఎదకు,ఎరుకే కూడా అది నీ ఎదకు
ప్రేమ మన మనసరాగాలే ధ్వనించే పావనమైన కథ
కబీరు కవి,మీరా బాయి ఒకపుడు పిచ్చివారే కదా?
జనం అన్నారు కన్నుల్లో కన్నీరున్నాయనే సత్యం
నువ్ గహిస్తే అదే ముత్యం,లేక నీరేగా అనునిత్యం
యోగి ఎదలో ఉప్పెనున్నా ఏడుపై రాదు ఎప్పటికీ
ఈ అశృకణం ప్రేమ ముత్యం, వీడనేలేను ఎన్నటికీ
నాకు సొంతం చేసి కూడా తిరిగి అడిగావు నీ మనసు
నాది కాలేని ఏ మనసు,నీది కానే కాదని తెలుసు
తుమ్మెదే కలువ పువ్వు పైన వాలితే ఓ అలఝడి మొదలు
కమ్మని కల మన మనసుల్లో కలిగితే ఓ అలఝడి మొదలు
ఇంత వరకీ జనం అంతా వింతగా విన్నారీ కథను
ఈ కథే యదార్థ గాధ అని తెలుపగా ఓ అలఝడి మొదలు
No comments:
Post a Comment