వీణా వేదిక వారి మనసు preview చూసే అవకాశం నాకు ఇటీవలె కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరహ subject పైన ఇంత తక్కువ వ్యవధిలో ఇంత సమర్థవంతంగా అనుకున్నది అనుకున్నట్టు చూపించగలిగేలా ఒక లఘుచిత్రం రావడం నిజంగా ఒక మంచి మార్పు. ఈ లఘుచిత్రం గురించి నాలుగు మాటలు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత నాకుందనిపించింది.
పుట్టిన ప్రతి మనిషికీ ఆ తర్వాత పుట్టుక లాగా ఖచ్చితమైన, అనివార్యమైన దశ ఏదైనా ఉంది అంటే అది కేవలం మరణమే. ఇది నిజం. జీవితం జనన మరణాలు అనే ఈ రెండు నిజాల నడుమ సాగే ఒక విచిత్ర నాటకం.బాల్యం, చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం వగైరాలతో వేగంగా సాగిపోయే తొలి సగం కాసేపాగి ఆలోచించేందుకు, అవలోకించేందుకు, అన్వేషించేందుకు ఎక్కువగా తావు ఇవ్వదు.ఒంటరిగా ఈ భూమిపైకొచ్చిన మనం తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలన్న చింతన మొదలయ్యేది రెండో సగంలోనే. ఈ తరహా చింతనావలయం లో చిక్కి మనసునే నీడగా, నేస్తంగా కలిగిన ఓ పెద్దమనిషి లోనయ్యే ఆలోచనా సరళిని కేవలం 35నిమిషాల్లో హృదయాలకు హత్తుకొనే విధంగా అవగతమయ్యేలా తీర్చిదిద్దిన లఘుచిత్రం "MANASU". ఈ కారణం చేత ఈ చిత్రం చాలా అభినందనీయం.
ఈ ప్రపంచం తో ఉన్న అన్ని బంధాలను చావు ద్వారా కోల్పోవడం అనే విషయం, ఆ దశలో ఉండి అలాంటి క్షణాలని గడుపుతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసినదే. ఆ కోవకి చెందిన వారి గుండెలని ఈ లఘుచిత్రం నేరుగా తాకుతుంది.ఇదిగో ఇది నీ కథే కదా అని అడగకనే అడుగుతుంది. చెప్పకనే చెబుతుంది. మరణించాక కూడా జీవించి ఉండాలంటే, జీవించి ఉండగానే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే సూక్ష్మాన్ని సున్నితమైన, సరళమైన శైలిలో ఈ చిత్రం లో తెరకెక్కించే ప్రయత్నం దర్శకులు చేశారని గమనించగలను.జీవిత పరమార్థాన్ని జీర్ణమయ్యే రీతిలో చెబుతూ, బంధాలకు ఎంత వరకు బందీగా ఉండాలో చిత్రం లోని ముఖ్య పాత్ర రూపేణ ప్రేక్షకలోకానికి చెప్పే ప్రయత్నం చేశారు.
Title Song
"చివరికెవరు ఎవరికి సేరువ? సీకట్లో సేరిపోదా ఎలుగుల ఏకువ?"
అంటూ పదునైన ప్రశ్నని సూటిగా వేస్తూ మొదలయ్యే Title song, చిత్ర సారాంశాన్ని పరిచయం చేస్తుంది.
"మూణ్ణాళ్ళు ఉన్నా కూడా మల్లెల ఎల్లువ, సక్కంగ సాటుకోదా ఉనికికి ఇలువ? అంటూ ఎన్నాళ్ళు బ్రతికాం అనేది కాదు, ఎంత అర్థవంతంగా బ్రతికాం అన్నది ముఖ్యమని జీవనదిశానిర్దేశం అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది.
"కంచికి చేరని కథేది మానవ? పోతేనేం పాత నీరు కొత్త నీరు చేరదా? కళ్ళ ముందు నిజాన్ని చూడవా? మనసు చేతిలో కీలుబొమ్మవా?"
అన్న మాటలు జీవితం లో ఎవరికీ కూడా ఇంకొకరితో బంధం అనేది శాశ్వతం కాదు. బంధాల ఊబిలో చిక్కుకొని లేని వాటి కొరకు ప్రాకులాడక, సత్యాలను తెలుసుకొని మనకంటూ ఉన్న పరిమిత జీవిత కాలాన్ని, మనదైన పరిధిలో అర్థవంతంగా పరిపూర్ణంగా గడపాలని గుర్తు చేస్తాయి. చేదు నిజాలను గ్రహించాలని, బాధాకరమైన పరిస్థితులని కూడా ఎదురుకోవాలని హెచ్చరిస్తాయి.
మానవ సంబంధాలు, జీవిత పరమార్థం, మనుష్య జన్మకి సాఫల్యం లాంటి పార్శ్వాలను అందమైన విధంగా ఆవిష్కరించిన చిత్రంగా ఈ లఘుచిత్రం ఓ ప్రత్యేకత సంపాదించుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఈ లఘుచిత్రం విమర్శుకల మన్ననలు పొందాలని, ప్రేక్షకుల మనసులో తమ మనసుకి దర్పణం గా నిలిచిపోవాలని ఆశిసూ యావత్ చిత్ర బృందానికి నా శుభాభినందనలు!!
ఇట్లు
శ్రీరామ్ సాంజి
పుట్టిన ప్రతి మనిషికీ ఆ తర్వాత పుట్టుక లాగా ఖచ్చితమైన, అనివార్యమైన దశ ఏదైనా ఉంది అంటే అది కేవలం మరణమే. ఇది నిజం. జీవితం జనన మరణాలు అనే ఈ రెండు నిజాల నడుమ సాగే ఒక విచిత్ర నాటకం.బాల్యం, చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం వగైరాలతో వేగంగా సాగిపోయే తొలి సగం కాసేపాగి ఆలోచించేందుకు, అవలోకించేందుకు, అన్వేషించేందుకు ఎక్కువగా తావు ఇవ్వదు.ఒంటరిగా ఈ భూమిపైకొచ్చిన మనం తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలన్న చింతన మొదలయ్యేది రెండో సగంలోనే. ఈ తరహా చింతనావలయం లో చిక్కి మనసునే నీడగా, నేస్తంగా కలిగిన ఓ పెద్దమనిషి లోనయ్యే ఆలోచనా సరళిని కేవలం 35నిమిషాల్లో హృదయాలకు హత్తుకొనే విధంగా అవగతమయ్యేలా తీర్చిదిద్దిన లఘుచిత్రం "MANASU". ఈ కారణం చేత ఈ చిత్రం చాలా అభినందనీయం.
ఈ ప్రపంచం తో ఉన్న అన్ని బంధాలను చావు ద్వారా కోల్పోవడం అనే విషయం, ఆ దశలో ఉండి అలాంటి క్షణాలని గడుపుతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసినదే. ఆ కోవకి చెందిన వారి గుండెలని ఈ లఘుచిత్రం నేరుగా తాకుతుంది.ఇదిగో ఇది నీ కథే కదా అని అడగకనే అడుగుతుంది. చెప్పకనే చెబుతుంది. మరణించాక కూడా జీవించి ఉండాలంటే, జీవించి ఉండగానే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే సూక్ష్మాన్ని సున్నితమైన, సరళమైన శైలిలో ఈ చిత్రం లో తెరకెక్కించే ప్రయత్నం దర్శకులు చేశారని గమనించగలను.జీవిత పరమార్థాన్ని జీర్ణమయ్యే రీతిలో చెబుతూ, బంధాలకు ఎంత వరకు బందీగా ఉండాలో చిత్రం లోని ముఖ్య పాత్ర రూపేణ ప్రేక్షకలోకానికి చెప్పే ప్రయత్నం చేశారు.
Title Song
"చివరికెవరు ఎవరికి సేరువ? సీకట్లో సేరిపోదా ఎలుగుల ఏకువ?"
అంటూ పదునైన ప్రశ్నని సూటిగా వేస్తూ మొదలయ్యే Title song, చిత్ర సారాంశాన్ని పరిచయం చేస్తుంది.
"మూణ్ణాళ్ళు ఉన్నా కూడా మల్లెల ఎల్లువ, సక్కంగ సాటుకోదా ఉనికికి ఇలువ? అంటూ ఎన్నాళ్ళు బ్రతికాం అనేది కాదు, ఎంత అర్థవంతంగా బ్రతికాం అన్నది ముఖ్యమని జీవనదిశానిర్దేశం అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది.
"కంచికి చేరని కథేది మానవ? పోతేనేం పాత నీరు కొత్త నీరు చేరదా? కళ్ళ ముందు నిజాన్ని చూడవా? మనసు చేతిలో కీలుబొమ్మవా?"
అన్న మాటలు జీవితం లో ఎవరికీ కూడా ఇంకొకరితో బంధం అనేది శాశ్వతం కాదు. బంధాల ఊబిలో చిక్కుకొని లేని వాటి కొరకు ప్రాకులాడక, సత్యాలను తెలుసుకొని మనకంటూ ఉన్న పరిమిత జీవిత కాలాన్ని, మనదైన పరిధిలో అర్థవంతంగా పరిపూర్ణంగా గడపాలని గుర్తు చేస్తాయి. చేదు నిజాలను గ్రహించాలని, బాధాకరమైన పరిస్థితులని కూడా ఎదురుకోవాలని హెచ్చరిస్తాయి.
మానవ సంబంధాలు, జీవిత పరమార్థం, మనుష్య జన్మకి సాఫల్యం లాంటి పార్శ్వాలను అందమైన విధంగా ఆవిష్కరించిన చిత్రంగా ఈ లఘుచిత్రం ఓ ప్రత్యేకత సంపాదించుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఈ లఘుచిత్రం విమర్శుకల మన్ననలు పొందాలని, ప్రేక్షకుల మనసులో తమ మనసుకి దర్పణం గా నిలిచిపోవాలని ఆశిసూ యావత్ చిత్ర బృందానికి నా శుభాభినందనలు!!
ఇట్లు
శ్రీరామ్ సాంజి
No comments:
Post a Comment